సెన్సార్ రివ్యూ : మహర్షి


సమ్మర్ సెన్సేషన్ మహర్షి మూవీ సెన్సార్ కార్యక్రమాలని పూర్తి చేసుకొంది. సింగిల్ కట్ లేకుండా ‘యు/ఎ’ సర్టిఫికెట్ పొందింది. సినిమా నిడివి 2గంటల 48నిమిషాలుగా లాక్ చేశారు. ‘మహర్షి’ అద్భుతంగా ఉన్నాడన్నది సినిమా చూసిన సెన్సార్ సభ్యుల మాట.

ఈ సినిమా కోసం దాదాపు రూ. 90కోట్ల బడ్జెట్ ఖర్చయిందని తెలుస్తోంది. ప్రీ-రిలీజ్ బిజినెస్ ఏకంగా రూ. 140కోట్ల వరకు జరిగినట్టు సమాచారమ్. అందుకు తగ్గట్టుగానే ఓపెనింగ్ కలెక్షన్స్ ని క్యాష్ చేసుకొనేందుకు మహర్షి విడుదలని భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. దాదాపు 1500 థియేటర్స్ లో మహర్షి విడుదల కాబోతుంది. టికెట్ రేట్లు రూ. 250పై మాటే. తొలివారం ఐదు షోలకి ప్లాన్ చేశారు.

‘జెర్సీ’ తర్వాత మరో పేరున్న సినిమా రాలేదు. రెండు వారాలు ఖాళీ. ఈ నేపథ్యంలో ఈ సమ్మర్ లో పెద్ద సినిమా మహర్షి కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రానికి వంశీపైడి పల్లి దర్శకత్వం వహించారు. పూజా హెగ్డే హీరోయిన్. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. దిల్ రాజు-పివిపి-అశ్వినీదత్ సంయుక్తంగా నిర్మించారు. మే9న మహర్షి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.