పూజా రేటుపై దర్శకుడు క్లారిటీ


హీరోయిన్ పూజా హేగ్డే రేటు ఇండస్ట్రీని షాక్ కి గురి చేస్తోంది. ఆమె వరుసగా స్టార్ హీరోలతో జతకడుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ బాబులతో ఓ రౌండ్ వేసింది. సెకండ్ రౌండ్ కి రెడీ అవుతోంది. బన్నీ-త్రివిక్రమ్ తాజా సినిమాలో పూజా నటిస్తోంది. దీంతోపాటు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో మరోసారి రొమాన్స్ చేయబోతుంది.

హరీష్ శంకర్-వరుణ్ తేజ్ కలయికలో ‘వాల్మీకి’ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తమిళ్ హిట్ ‘జిగర్తాండ’కు రీమేక్ ఇది. ఇందులో వరుణ్ తేజ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడు. ఇందుకోసం ఆయన డిఫరెంట్ లుక్ లోకి మారిపోయాడు. ఐతే, ఈ సినిమా కోసం పూజా హెగ్డే ని హీరోయిన్ గా తీసుకోనున్నారు. కేవలం 15రోజుల కాల్షీట్ల కోసం ఏకంగా రూ. 2కోట్ల పారితోషికం ఇవ్వబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. తాజాగా, ఈ ప్రచారంపై దర్శకుడు హరీష్ శంకర్ స్పందించారు.

“పూజా హెగ్డే రెమ్యునరేషన్ విషయంలో వస్తున్న వార్తలు అవాస్తవం. సినీ అభిమానులందరికి రిక్వస్ట్ చేస్తున్నా.. నా నుంచి కానీ, ప్రొడక్షన్ హౌస్ నుంచి కానీ అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడండి” అని హరీష్ ట్విట్ చేశారు. పూజా రెమ్యూనరేషన్ విషయాన్ని ఖండించిన హరీష్.. ఆమె వాల్మీకిలో నటించలేదని మాత్రం చెప్పలేదు. దీంతో.. వాల్మీకి హీరోయిన్ పూజానే. కానీ, ఆమె పారితోషికం రూ. 2కోట్లు కాదనే క్లారిటీ వచ్చేసినట్టయింది.