ఛార్మి ప్రేమని ఓకే చేసిన త్రిష.. త్వరలో పెళ్లి !


హీరోయిన్స్ త్రిష-ఛార్మిల మధ్య చాన్నాళ్ల నుంచి ఎఫైర్ నడుస్తోంది. అవునూ.. వీరిద్దరు ఒకరంటే మరొకరు పడి చచ్చే రకం. కలిస్తే బుగ్గులు గిల్లేసుకొని, హంగులతో రెచ్చిపోయే రకం. త్రిషని ప్రేమిస్తున్నా. పెళ్లి కూడా చేసుకొంటానని గతంలోనే ప్రకటించింది ఛార్మి.
త్రిష బర్త్ డే సందర్భంగా తాజాగా మరోసారి ఆమెకి ప్రపోజ్ చేసింది ఛార్మి.

“బేబీ ఐ లవ్యూ. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. నా ప్రపోజల్ ను ఎప్పుడు అంగీకరిస్తావా అని ఎదురుచూస్తున్నా. మనం పెళ్లి చేసుకుందాం. ఇప్పుడిది చట్టబద్ధమేనట!” అంటూ కవ్వించేలా ట్వీట్ చేసింది ఛార్మి. ఇప్పుడీ ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిజంగానే… ఈ ముదురు ముద్దుగుమ్మలు పెళ్లి చేసుకొనే షాక్ ఇస్తారేమో చూడాలి.

సినిమాల విషయానికొస్తే.. ఈ వయసులోనూ త్రిష సోలో హీరోయిన్ గా హిట్స్ కొడుతోంది. గత యేడాది ’96’ చిత్రంలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొంది. ఈ యేడాది ‘పేట’తో హిట్ కొట్టింది. ప్రస్తుతం శరవణ్ దర్శకత్వంలో ‘రాంగీ’ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రానికి ఎఆర్ మురగదాస్ కథని అందించడం విశేషం. ఛార్మి దర్శకుడు పూరితో కలిసి సినిమాలు నిర్మిస్తోంది. ప్రస్తుతం ఇస్మార్ట్ శంకర్ షూటింగ్ లో బిజీగా ఉంది.