అయిదో విడత పోలింగ్ ప్రారంభం

సార్వత్రిక ఎన్నికల్లో అయిదో విడత పోలింగ్‌ ప్రారంభమైంది. ఈ విడతలో 51 లోక్ సభ నియోజకవర్గాలకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌ సహా దేశంలోని ఏడు రాష్ట్రాల్లో విస్తరించిన 51 నియోజకవర్గాల నుంచి 674 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఐదో విడత ఎన్నికలు పూర్తయితే.. దేశంలో 424 నియోజకవర్గాలకు ఎన్నికలు ముగిసినట్లవుతుంది.

మిగిలిన 118 స్థానాలకు ఆరు, ఏడు దశల్లో పోలింగ్‌ జరుగుతుంది. ఇక, జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్‌ లోక్‌సభ నియోజకవర్గానికి నేటితో పోలింగ్‌ ముగియనుంది. ఈ నియోజకవర్గానికి మూడు, నాలుగు, అయిదు దశల్లో పోలింగ్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక, ఐదో విడతలో ఉదయం నుంచే పలువురు ప్రముఖులు ఓటు హక్కుని వినియోగించుకొన్నారు. కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కొద్దిసేపటి క్రితమే లక్నోలో తన ఓటు హక్కుని వినియోగించుకొన్నారు.