ఎన్టీఆర్ హీరోయిన్’కి లైగింక వేధింపులు


లైంగిక వేధింపులపై మరో హీరోయిన్ నోరు తెరచింది. హీరోయిన్ గా ప్రయత్నాలు చేస్తున్న సమయంలో, హీరోయిన్ గా ఓ రేంజ్ కి చేరుకొన్న తర్వాత కూడా వేధింపులకు గురయ్యానని చెప్పింది. తెలుగులో స్టార్ హీరోలతో రొమాన్స్ చేసిన హీరోయిన్ సమీరారెడ్డి.. తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల విషయాన్ని కాస్త ఆలస్యంగా బయటపెట్టింది. ఇండస్ట్రీలో హీరోయిన్స్ ని ఆట వస్తువులా చూస్తున్నారు. కొత్తగా వచ్చే హీరోయిన్స్ ని నుంచి పడక సుఖం కోరుకుంటారు. కమెంట్ మెంట్ అడిగిన సందర్భాలు ఉన్నాయని అంది. ఇండస్ట్రీలో చాలా మార్పు రావాలి. #మీటూ ఉద్యమంతో అటువైపుగా చిరు అడుగులు పడ్డాయని చెప్పుకొచ్చింది.

తెలుగులో సమీరా రెడ్డి చేసింది తక్కువ సినిమాలే. అయినా స్టార్ హీరోలతో కలిసి నటించింది. బాలయ్య ‘నరసింహుడు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. రెండో సినిమా ‘జై చిరంజీవి’ మెగాస్టార్ చిరంజీవితో జతకట్టింది. ఎన్టీఆర్-సమీరా జంటగా ‘అశోక్’ సినిమా మంచి విజయాన్ని అందుకొంది. ‘సూర్య సన్నాఫ్ కృష్ణ’లో హీరోయిన్ గా చేసింది. ఆమె నటించిన ఆఖరి తెలుగు చిత్రం ‘కృష్ణం వందే జగద్గురం’. ఇందులో గెస్ట్ రోల్ లో మెరిసింది. ఇక, 2104లో వ్యాపారవేత్త అక్షయ్ వార్దే పెళ్లాడి సినిమాలకి దూరమైంది. ప్రస్తుతం సమీరారెడ్డి ప్రెగ్నెంట్. ఆమె రెండో బిడ్డకు జన్మనివ్వబోతుంది. ఈ నేపథ్యంలో తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరోయిన్ గా తాను ఎదుర్కొన్న వేధింపులని బయటపెట్టింది.