రిషభ్ పంత్ అవుట్

విశాఖ వేదికగా జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. 163పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలి 19ఓవర్లలో158/7 చేసింది. రిషబ్ పంత్ 49 (21 బంతుల్లో 2×4, 5×6 ) భువనేశ్వర్ కుమార్ వేసిన 19ఓవర్ లో అవుటయ్యాడు. ఆఖరి ఓవర్ లో ఢిల్లీకి 5 పరుగులు అవసరం.

163పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలి 10ఓవర్లలో (83/1) అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. ఆ తర్వాత సన్ రైజర్స్ పుంజుకొంది. ఖలీల్ అహమ్మద్ వేసిన 11ఓవర్ లో రెండు వికెట్లు పడ్డాయి. మంచి ఊపుమీదున్న పృధ్వీ షా (56)తో పాటు ఢిల్లీ కెప్టెన్ శ్రీయస్ అయ్యర్ (8)ని అవుట్ చేశాదు ఖలీల్. ఇక, 14ఓవర్ లోనూ రషీద్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టాడు. మున్రో (14), అక్షర్ పటేల్ (0) అవుట్ చేశాడు.