బన్నీ-త్రివిక్రమ్ సినిమా.. బ్రేక్ పడింది !

స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి దర్శకుడు త్రివిక్రమ్ తో జతకట్టిన సంగతి తెలిసిందే. వీరి కలయికలో హ్యాట్రిక్ చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవలే రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం అయింది. తాజా సమాచారమ్ ప్రకారం ఈ సినిమా తొలి షెడ్యూల్ పూర్తయ్యింది. త్వరలోనే రెండో షెడ్యూల్ లో మొదలుకానుంది. అంతకంటే ముందు చిత్రబృందం సమ్మర్ బ్రేక్ తీసుకోనుంది. అది ఎన్ని రోజులు అన్నది మాత్రం తెలియరాలేదు.

ఈ చిత్రంలో బన్నీకి జంటగా పూజా హెగ్డే జతకట్టనుంది. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ టబు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇందులో ఫాదర్ సెంటిమెంట్ తో పాటు మదర్ సెంటిమెంట్ బలంగా ఉండనుందని తెలుస్తోంది. ఈ చిత్రం కోసం నాన్ననేను టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. గీతాఆర్ట్స్‌, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దసరా కానుకగా సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.