ఢిల్లీపై చెన్నై ఈజీ గెలుపు.. ఫైనల్ చేరిక !


అనుభవమే గెలిచింది. విశాఖ వేదికగా జరిగిన రెండో క్వాలిఫయర్‌ మ్యాచ్‌ లో చెన్నై ఆరు వికెట్ల తేడా ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20ఓవర్లలో 9వికెట్లు కోల్పోయి 148 పరుగులు మాత్రమే చేసింది. రిషభ్ పంత్ 34, మున్రో 27, శిఖర్ ధావన్ 18 పరుగులు చేశారు. ఢిల్లీ నిర్దేశించిన 148 పరుగుల లక్ష్యాన్ని చెన్నై 19ఓవర్లలో 4వికెట్లు కోల్పోయి చేధించింది.

ఓపెనర్లు షేన్‌ వాట్సన్‌ (50; 32 బంతుల్లో 3×4, 4×6), డుప్లెసిస్‌(50; 39 బంతుల్లో 7×4, 1×6) చెలరేగి ఆడారు. రైనా (11; 13 బంతుల్లో), అంబటి రాయుడు (20*; 20 బంతుల్లో 3×4) నిలకడగా ఆడారు. ఎంఎస్‌ ధోనీ (9; 9 బంతుల్లో 1×4) జట్టు రెండు పరుగులు చేస్తే విజయం సాధిస్తుందనగా గెలుపు షాట్‌ ఆడబోయి వెనుదిరిగాడు. ఐపీఎల్ 12 సీజన్లలో చెన్నై 8వ సారి ఫైనల్‌ చేరుకోవడం గమనార్హం. నిషేధం కారణంగా అందులో 2 ఎడిషన్లు ఆడనేలేదు. ఆదివారం చెన్నై-ఢిల్లీల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.