ఐపీఎల్-2019 ఉత్తమ జట్టు.. ఇదే !


ఐపీఎల్-2019 ఆఖరి అంకానికి చేరుకొంది. ఆదివారం హైదరాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య ఫైన పోరు జరగనుంది. ఐతే, అంతకంటే ముందే భారత మాజీ క్రికెటర్‌ అనిల్‌ కుంబ్లే తన 2019 ఉత్తమ ఐపీఎల్‌ జట్టును ప్రకటించాడు. ధోనీని కెప్టెన్‌గా ప్రకటించిన ఆ జట్టులో విరాట్‌ కోహ్లీతో పాటు రోహిత్‌ శర్మకు చోటు దక్కలేదు. ఆశ్చర్యకరంగా రాజస్థాన్‌ రాయల్స్‌ లెగ్‌ స్పిన్నర్‌ శ్రేయస్‌ గోపాల్‌కు చోటు కల్పించాడు. దిల్లీ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌కు కూడా ఈ జట్టులో చోటు లభించింది.

కుంబ్లే ప్రకటించిన ఐపీఎల్-2019 ఉత్తమ జట్టు ఇదే :

ధోనీ (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), డేవిడ్‌ వార్నర్‌, కేఎల్‌ రాహుల్, శ్రేయస్‌ అయ్యర్‌, రిషభ్‌పంత్‌, హార్దిక్‌ పాండ్య, అండ్రూ రసెల్‌, శ్రేయస్‌ గోపాల్‌, ఇమ్రాన్‌ తాహీర్‌, కగిసో రబాడా, జస్ప్రీత్‌ బుమ్రా.