పంత్ కు పాఠాలు నేర్పుతున్న జీవా

ధోనీ, సాక్షి ముద్దుల కూతురు జీవా చాలా హుషారు. జీవా ఏకంగా రిషభ్‌పంత్‌కే హిందీలో ఓనమాలు నేర్పించింది. ఆ బుల్లి టీచర్‌ చెప్పే పాఠాన్ని పంత్‌ శ్రద్ధగా నేర్చుకోవడం గమనార్హం. ఇప్పుడీ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది.

యువ వికెట్‌కీపర్‌ రిషభ్‌పంత్‌ను ఎంఎస్‌ ధోనీ వారసుడిగా భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో క్వాలిఫయర్‌ మ్యాచ్‌ ముగియగానే ధోనీ సతీమణి సాక్షి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్‌ చేసింది. ఆ వీడియోలో జీవా రిషభ్‌పంత్‌ హిందీలో ఓనమాలు నేర్పించింది. ఇక, సోమవారం ఐపీఎల్ 12 ఫైనల్ మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్‌- చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి.

View this post on Instagram

Back to Basics !

A post shared by ZIVA SINGH DHONI (@ziva_singh_dhoni) on