మహర్షులతో మహర్షి.. చూశారా ?

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ నటించిన చిత్రం మహర్షి. గత గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చిన మహర్షి మెగా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అంతకుమించి విమర్శకుల ప్రశంసలు అందుకొంది. మహేష్ కెరీర్ లోనే తొలివారం అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. మహేష్ రైతుగా కనిపించే ఏపీసోడ్ సినిమాకే హైలైట్ గా నిలిచింది.

ఈ నేపథ్యంలో మహర్షి చిత్రబృందం ‘మహర్షులతో మహర్షి’ కార్యక్రమాన్ని నిర్వహించింది. మంచి చదువులు చదివి. విదేశాల్లో మంచి ఉద్యోగాల్లో స్థిరపడినవారు.. ఇండియాకు తిరిగొచ్చి సాంప్రదాయ పద్దతులతో వ్యవసాయం చేస్తున్న వారితో మహర్షి చిత్రబృందం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. మహర్షులు చెప్పిన మాటలు విని మహర్షి (మహేష్) ఫిదా అయిపోయాడు.