కమెడియన్ దర్శకత్వంలో సినిమా పూర్తి.. !


కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి హీరోగా హిట్లు కొట్టాడు. కమెడియన్ గా కొనసాగుతూనే మంచి కథ దొరికితే హీరోగా ట్రై చేస్తున్నారు. ఇప్పుడీ కమెడియన్ దర్శకుడిగా మారాడు. సలైంట్ గా ఓ సినిమా కూడా పూర్తి చేశాడు. ఆ సినిమా టైటిల్ “భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు”. టాలీవుడ్ కమెడియన్స్ అంతా ఈ సినిమాలో కనిపించబోతుండటం విశేషం.

ప్రస్తుతం టాలీవుడ్ లో కొనసాగుతున్న హాస్యనటులంతా కలిసి ‘ఫ్లయింగ్ కలర్స్’ పేరుతో ఎప్పటికప్పుడు గెట్-టు-గెదర్స్ పెట్టుకుంటున్న సంగతి తెలిసిందే. అలా కలుస్తున్న వీళ్లంతా నిర్మాతలుగా మారి, అదే పేరుతో నిర్మాణ సంస్థ ప్రారంభించారు. వీళ్లంతా కలిసి ఓ సబ్జెక్ట్ ఫైనలైజ్ చేశారు. ఆ కథకు దర్శకత్వం వహించే బాధ్యతల్ని శ్రీనివాసరెడ్డికి అప్పగించారు. అలా దర్శకుడిగా మారిన శ్రీనివాసరెడ్డి దర్శకుడిగా సినిమా షూటింగ్ పూర్తి చేశాడు. త్వరలోనే సినిమా ప్రమోషన్స్ మొదలెట్టి.. రిలీజ్ డేటుని ప్రకటించబోతున్నారు. ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనింగ్ గా ఉంటుంది.