కాంగ్రెస్ గెలబోతున్న ఐదు ఎంపీ స్థానాలు.. ఇవే !


తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో తెరాస టార్గెట్ 16. ‘కారు జోరు పదహోరు’ స్లోగన్ ఆ పార్టీ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్లింది. టార్గెట్ ని టచ్ చేస్తామనే ధీమాతో ఉంది. మరోవైపు, అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవం దృష్ట్యా తెలంగాణ కాంగ్రెస్ గొప్పలకి వెళ్లలేదు. చాలా చిన్ని టార్గెట్ నే పెట్టుకొంది. కనీసం ఓ ఆరు స్థానాల్లో గెలుపుని టార్గెట్ ని పెట్టుకొంది. ఐతే, ఆరు కాదు కానీ.. ఐదు స్థానాల్లో కచ్చితంగా గెలవబోతున్నాం అంటున్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.

గురువారం జగ్గారెడ్డి హైదరాబాద్ గాంధీ భవన్ లో మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, రేణుక చౌదరి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డి తప్పకుండా గెలుస్తారని జోస్యం చెప్పారు. వీరిలో రేణుక చౌదరి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిలకు కేంద్రమంత్రి పదవులు వస్తాయని వ్యాఖ్యానించారు. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం రాబోతుందనే ధీమా తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తోంది. ఆ ధీమా నిజమవుతోందా.. ? అన్నది ఈ నెల 23న తెలియనుంది.