లక్ష్మీస్ ఎన్టీఆర్’కు కలెక్టర్ హెచ్చరికలు

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలకి ఈసీ నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు. అయినప్పటికీ.. కడప జిల్లాలో ఒకట్రెండు థియేటర్స్ లో సినిమా ప్రదర్శించారు. ఆ థియేటర్స్ పై ఈసీ చర్యలు తీసుకొంది. థియేటర్స్ లైసెన్స్ ని క్యాన్సిల్ చేయించింది. ఈ నెల 19న చిత్తూరులో లక్ష్మీస్ ఎన్ టీఆర్ ని ప్రదర్శించబోతున్నట్టు వార్తలొచ్చాయ్. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ అలర్ట్ అయ్యారు.

ఈసీ ఆదేశాలను బేఖాతరు చేసి సినిమాను ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కలెక్టర్ తెలిపారు. ఈ మేరకు ఆర్‌వోలు, ఎస్పీలు, సబ్‌కలెక్టర్లు, ఆర్‌డీవో సహా 66 మంది తహసీల్దార్లకు ఆదేశాల నకళ్లను పంపారు. జిల్లాలోని థియేటర్లు అన్నీ ఈ ఆదేశాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.