‘సాహో’ సప్రైజ్ చూశారా.. ?

సాహో సప్రైజ్ వచ్చేసింది. ఈ సినిమా కొత్త పోస్టర్ ని విడుదల చేసింది చిత్రబృందం. ఆగస్టు15న విడుదల తేదిని అధికారికంగా ప్రకటిస్తూ కొత్త పోస్టర్ ని వదిలారు. ఇందులో ప్రభాస్ కళ్లజోడు పెట్టుకొని డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నారు. కొన్నాళ్లుగా సాహో విడుదల వాయిదా పడే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. షూటింగ్ లో జాప్యం జరగడమే ఇందుకు కారణమనే వార్తలొచ్చాయ్. తాజాగా రిలీజ్ డేటుని ప్రకటించి.. ఈ ప్రచారానికి చెక్ పెట్టింది చిత్రబృందం.

ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్ కి జంటగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ నటిస్తున్నారు. దాదాపు రూ. 200కోట్లకు పైగా బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. యాక్షన్ సన్నివేశాలకే రూ. 90కోట్లు ఖర్చు చేస్తున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న చిత్రం కావడంతో సాహోపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. సాహోని తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ బాషల్లో విడుదల చేయనున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ కోసం ప్రేక్షకులు, ఇండస్ట్రీ ఆసక్తిగా ఎదురు చూస్తోంది.