శ్రీహరి తనయుడు హీరోగా.. ‘రాజ్‌దూత్’ !

తెలుగు తెరపై తనదైన ముద్ర వేశారు నటుడు శ్రీహరి. 2013లో శ్రీహరి హ‌ఠాత్మరణం తెలుగు తెరకు తీరని లోటు మిగిల్చింది. ఇప్పుడు శ్రీహరి నట వారసుడుగా ఆయన పెద్ద కొడుకు మేఘాంశ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ‘భైర‌వ’ సినిమాలో మేఘాంశ్ చైల్డ్ ఆర్టిస్టుగా నటించారు. ఆ తర్వాత చదువులపై దృష్టి సారించేందుకు సినిమాలకి దూరంగా ఉన్నారు.

ఇప్పుడు మేఘాంశ్ చదువు పూర్తవ్వడంతో హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. మేఘాంశ్ ఎంట్రీ చిత్రానికి కార్తీక్ – అర్జున్ ద‌ర్శ‌క ద్వ‌యం దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రానికి ‘రాజ్ దూత్’ టైటిల్ ని ఫిక్స్ చేశారు. బైక్ పేరుతో వచ్చిన ఆర్ ఎక్స్ 100 సంచలన విజయాన్ని నమోదు చేసింది. రాజ్ దూత్ కూడా రొమాంటిక్ బోల్డ్ స్టోరీ అని తెలుస్తోంది. ఇందులో మేఘాంశ్ మాస్ పాత్రలో అలరిస్తాడని చెబుతున్నారు. మొదట్లో.. చిన్న పాత్రలు, వినల్ గా మెప్పించిన శ్రీహరి.. ఆ తర్వాత హీరోగా విజయాలు అందుకొన్నాడు.