గ్రేట్ : మూర్తన్న పకోడి తిన్న మెగాస్టార్


పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి తాజా చిత్రం “మార్కెట్ లో ప్రజాస్వామ్యం”. ఈ సినిమా ఆడియో వేడుక మంగళవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఈ వేడుకకి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా చిరు రూల్స్ బ్రేక్ చేశారు. మూర్తన్న పకోడి, జిలేబీని ఆరగించారు. డైట్ మెయింటైన్ చేసే మెగాస్టార్ బయట ఏమీ తినరు. ఐతే, మూర్తన్న కోసం రూల్స్ బ్రేక్ చేసి.. పకోడి, జిలేబీలని చిరు తినేయడం హాట్ టాపిక్ గా మారింది. మెగాస్టార్ ఊరికే కారు అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక, మెగాస్టార్ చిరంజీవి 151చిత్రం ‘సైరా’ షూటింగ్ ఆఖరి దశకు చేరుకొంది. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. తొలితరం సాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్ది జీవితకథ ఆధారంగా ‘సైరా’ తెరకెక్కుతోంది. ఇందులో మెగాస్టార్ నరసింహారెడ్దిగా, ఆయన గురువు పాత్రలో బిగ్ బీ అమితాబ్ నటిస్తున్నారు. నయనతార, కిచ్చ సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, తమన్నా.. తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దాదాపు రూ. 300కోట్ల బడ్జెట్ తో రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. గాంధీజయంతి కానుకగా సైరా ప్రేక్షకుల ముందుకు రానుంది.