తొలిరౌండ్ రిపోర్ట్ : 100స్థానాల్లో వైకాపా ముందంజ

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఏపీ అసెంబ్లీ ఫలితాల్లో తొలిరౌండ్ ముగిసేసరికే వైకాపా స్పష్టమైన మెజారిటీ దూసుకెళ్తోంది. ఆ పార్టీ 100స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తోంది. తెదేపా కేవలం 20స్థానాల్లోపే ఆధిక్యంలో ఉంది. జనసేన 2స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. భీమవరంలో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వెనకంజలో ఉన్నారు. గాజువాకలోనూ పవన్ వెకనపడ్డారు.

ఇక, లోక్ సభ ఎన్నికల్లో తొలిరౌండ్ లో భాజాపా ఆధిక్యంలో దూసుకెళ్తోంది. తొలిరౌండ్ ముగిసేసరికే బీజేపీ 280స్థానాలకుపైగా ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 80కిపైగా, ఇతరులు 80కిపైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. తెలంగాణలో తెరాస పదకొండు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. మొత్తానికి ఎగ్జిట్ పోల్స్ అనుగుణంగానే ఫలితాలు వెలువడుతున్నాయి.