గ్రేట్ : ఎంపీ స్థానాల్లో వైకాపా క్లీన్ స్వీప్


ఏపీ ప్రజలు తెదేపాకు గుండుగీశారు. ఆ పార్టీకి ఒక్క లోక్ సభ స్థానం కూడా లభించేలా కనబడటం లేదు. తాజా ఫలితాల ట్రెండ్ ప్రకారం ఏపీలోని 25లోక్ సభ స్థానాల్లో వైకాపా ఆధిక్యంలో ఉంది. తెదేపా ఒక్కస్థానంలో కూడా సోయిలో లేకపోవడం విచారకరం. ఢిల్లీలో ఇన్నాళ్లు తెదేపా ఎంపీలు చేసిన హడావుడి పట్ల ఏపీ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు కనబడుతోంది.

ఇక, అసెంబ్లీ ఎన్నికల్లోనూ తెదేపాకి ఘోర పరాజయం తప్పలేలా లేదు. 150స్థానాల్లో వైకాపా ఆధిక్యంలో ఉండగా, తెదేపా 24స్థానాల్లో, జనసేన ఒక్కస్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొనేందుకు వైకాపా ముహూర్తాలు ఖరారు చేసుకొంటోంది. ఈ నెల 25న వైకాపా సీఎల్పీ సమావేశం నిర్వహించి.. ఈ నెల 30న జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోటున్నట్టు తెలిసింది.