కోమట్ రెడ్డి, ఉత్తమ్ గెలుపు

లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ బోణి చేసింది. భువనగిరి నుంచి కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డి గెలుపొందారు. ఆయన తెరాస అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ పై నాలుగువేల పై చిలుకు మెజారిటీతో గెలుపొందారు. ఇది ప్రజలు నాకిచ్చిన బర్త్ డే గిఫ్ట్ అన్నారు కోమట్ రెడ్ది. ఇక, నల్గొండ నుంచి టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుపొందారు. ఆయన 19 వేల పైగా భారీ మెజార్టీతో గెలిచారు.

మల్కాజిగిరి లోక్ సభ స్థానం నుంచి రేవంత్ రెడ్డి స్వల్ప మెజారిటీలో ఉన్నారు. ఇక, మొత్తంగా చూసుకొంటే.. తెరాస 8 స్థానాల్లో గెలిచేలా కనిపిస్తోంది. కాంగ్రెస్ 4, బీజేపీ4, ఎంఐఎం ఒకస్థానంలో గెలుపు ముంగిట ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెరాస పెట్టుకొన్న 16ఎంపీస్థానాల టార్గెట్ లో సగం టార్గెట్ మాత్రమే రీచ్ అయ్యేలా కనిపిస్తోంది. మరీ..దీనిపై ఆ పార్టీ ఎలా స్పందిస్తుందన్నది చూడాలి.