రేవంత్ రెడ్డి గెలుపు


తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మురిసింది. ఆ పార్టీ నాలుగు స్థానాల్లో విజయం సాధించింది. మల్కాజిగిరి నుంచి రేవంత్ రెడ్డి గెలుపొందారు. ఆయన తెరాస అభ్యర్థి మర్రి రాజశేకర్ రెడ్డిపై 6,270ఓట్ల తేడాతో గెలుపొందారు.

భువనగిరి నుంచి కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డి గెలుపొందారు. ఆయన తెరాస అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ పై నాలుగువేల పై చిలుకు మెజారిటీతో గెలుపొందారు. ఇక, నల్గొండ నుంచి టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుపొందారు. ఆయన 19 వేల పైగా భారీ మెజార్టీతో గెలిచారు. చేవేళ్ల నుంచి కొండా విశ్వేశ్వర రెడ్డి గెలిచారు. మొత్తంగా నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది.