ముగ్గురు దర్శకులు హీరోలుగా దర్శకేంద్రుడి సినిమా !

ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు ఓ ప్రయోగానికి రెడీ అయినట్టు సమాచారమ్. ఆయన ముగ్గురు ద‌ర్శ‌కులు, ముగ్గురు క‌థానాయిక‌ల‌తో ఓ సినిమా రూపొందించ‌డానికి రెడీ అయినట్టు తెలుస్తోంది. ఇక్కడ ముగ్గురు దర్శకులు హీరోలు అన్నమాట. సినిమాకి దర్శకత్వం వహించేది మాత్రం మరో దర్శకుడు. అంటే.. మొత్తం నలుగురు దర్శకులు ఈ సినిమా కోసం పని చేయబోతున్నారు అన్నమాట. ఈ చిత్రాన్ని కె.రాఘ‌వేంద్ర‌రావు, శోభు యార్ల‌గ‌డ్డ‌లు సంయుక్తంగా నిర్మిస్తార‌ని తెలుస్తోంది.

హీరోలుగా మారబోతున్న ఆ ముగ్గురు దర్శకులు ఎవరు ? ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్న మరో దర్శకుడు ఎవరు ?? అనేది తెలియాల్సి ఉంది. ‘ఓం నమో వెంకటేశాయ’ సినిమా తర్వాత రాఘవేంద్ర రావు మరో సినిమాకి దర్శకత్వం వహించలేదు. ఆయన దర్శకత్వానికి దాదాపు రిటైర్డ్మెంట్ ప్రకటించినట్టేననే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో దర్శకేంద్రుడి నిర్మాతగా ఓ విన్నూతమైన సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారనే న్యూస్ బయటికొచ్చిది. ఇందులో నిజమెంత ? అనేది చూడాలి.