అప్పుడు అన్నయ్య, ఇప్పుడు తమ్ముడు.. టీడీపీని ఓడించారు !

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయానికి కారణలేంటీ ? ఇప్పుడు సర్వత్రా జరుగుతోన్న చర్చ ఇది. ఐతే, జనసేన కారణంగానే ఇంత ఘోరంగా ఓడామని కొందరు తెదేపా నేతలు అభిప్రాయపడుతున్నారు. వారి వాదనలోనూ తప్పులేదు. ఎందుకంటే ? దాదాపు 30స్థానాల్లో వైసీపీకి వచ్చిన ఆధిక్యం కంటే జనసేనకు వచ్చిన ఓట్లు ఎక్కువ. దాదాపు 25స్థానాల్లో జనసేన గట్టిపోటీనిచ్చింది. ఈ నేపథ్యంలో టీడీపీ ఘోర పరాజాయానికి ప్రధాన కారణం జనసేనని ఆ పార్టీ నేతలు చెప్పుకొంటున్నారు.

2009లో ప్రజారాజ్యం కారణంగా టీడీపీ ఓటమి పాలైందని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. ఇప్పుడు జనసేన కారణం అదే జరిగింది. ఈ లెక్కన అన్నయ్య చిరంజీవి, తమ్ముడు పవన్ కళ్యాణ్ కారణంగా టీడీపీ ఒక్కోసారి ఓటమిపాలైందని చెప్పవచ్చు. ఐతే, 2014లో టీడీపీ గెలుపులో జనసేన కీలక పాత్ర పోషించింది. అదే పార్టీ 2019లో టీడీపీ ఓటమికి కారణం కావడం గమనార్హం. ఇకపై కూడా తెదేపా, జనసేన కలిసి అధికార వైకాపాపై పోరాటం చేస్తారా ? లేక ఎవరి దారి వారు చూసుకొంటారా ?? అనేది చూడాలి.