కవిత గెలుపు కోసం రాజీనామా చేస్తాడట !


తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో తెరాసకు పెద్ద షాకే తగిలింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవిత నిజామాబాద్ లో ఓటమిపాలయ్యారు. దీన్ని తెరాస శ్రేణులు తట్టులేకపోతున్నాయి. కనీసం కవితని అసెంబ్లీకి పంపించాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇందులో భాగంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో ఖాళీకాబోతున్న హుజురాబాద్ స్థానం నుంచి కవితని బరిలోకి దించే ఆలోచన చేస్తున్నారు. మరోవైపు, కవిత కోసం రాజీనామా చేస్తానని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ ప్రకటించారు.

కవిత కోసం అవసరమైతే తన సీటును త్యాగం చేస్తానని.. దీనిపై అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందన్నారు. సంజయ్ కుమార్. కవితపై ఆయనకి అంత భక్తి ఎందుకు ? అంటే.. కవిత ఓటమికి తెరాస ఎమ్మెల్యేలే కారణమనే ప్రచారం ఉంది. దీనిపై తెరాస ప్రక్షాళన చేపటింది. అందులో తెరాస ఎమ్మెల్యేల కుమ్మక్కు రాజకీయాలు బయటపడనున్నాయి. దాని నుంచి బయటపడేందుకు సంజయ్ కుమార్ ఇలాంటి ప్రకటన చేశారేమో… !