జగన్ కేబినేట్ లో వీరికి బెర్తులు ఖాయం !

ఏపీ సీఎం వైఎస్ జగన్ మాట తప్పడు. మడమ తిప్పడు. అదే ఆయన్ని సీఎం చేసిందని చెబుతుంటారు. పాదయాత్ర, ఎన్నికల ప్రచారం సందర్భంలో కొందరు నేతలకు మంత్రులుగా అవకాశం కల్పిస్తానని ఇప్పటికే జగన్‌ హామీ ఇచ్చారు. దాని ప్రకారం జగన్ కేబినేట్ లో కొందరి బెర్తులు ఖాయమైనట్టు చెప్పవచ్చు. ఈ లిస్టులో ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, చిలకలూరిపేట టికెట్‌ను త్యాగం చేసిన మర్రి రాజశేఖర్‌కు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశముంది.

జూన్‌ 8న కేబినెట్‌ విస్తరణ జరిగే అవకాశముంది. ఈ నేపథ్యంలో జగన్ మంత్రివర్గ కూర్పుపై కసరత్తు మొదలెట్టినట్టు తెలుస్తోంది. దీనికోసం వైకాపా ముఖ్యనేతలతో ఆయన చర్చిస్తున్నారు. జూన్ 8మంత్రివర్గ విస్తరణ. అదే రోజు కేబినేట్ తొలి బేటీ కానుంది. ఇక, జూన్‌ 15 లేదా ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మూడు రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారమ్.