రామ్ చరణ్ సినిమాలో అల్లు అర్జున్ ?

‘మహర్షి’ సినిమాతో సూపర్ స్టార్ మహేష్ బాబుకు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు వంశీ పైడిపల్లి. ఆయన తదుపరి చిత్రం రామ్ చరణ్ ఉండబోతుందనే ప్రచారం జరుగుతోంది. అది కూడా దిల్ రాజు బ్యానర్ లోనే ఉండబోతుంది. లెటెస్ట్ న్యూస్ ఏంటంటే ? వంశీ తదుపరి సినిమా చరణ్ తో కాదు.. బన్నీతో ఉండబోతుంది. ఇప్పటికే బన్నీని దిల్ రాజు ఒప్పించాడు. త్వరలోనే వంశీకి స్టోరీ లైన్ వినిపించనున్నాడు. ఆయన ఓకే చెబితే పూర్తి స్క్రిప్టుని రెడీ చేసే పనిని మొదలెట్టనున్నారు.

ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ టబు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తయింది. ఈ సినిమా తర్వాత బన్నీ వేణు శ్రీరామ్, సుకుమార్ లతో సినిమాలు చేయాల్సి ఉంది. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో బన్నీ సినిమా ఉండనుంది. ఈలోపు నెమ్మదిగా బన్నీ సినిమా స్క్రిప్టుని పూర్తి చేయనున్నాడు వంశీ.