ఈ నెల 4న కాళేశ్వరం ప్రాజెక్టుకు కేసీఆర్‌


తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఈ నెల 4న కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా జులైలో నీళ్లు అందిస్తామని కేసీఆర్‌ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యత సంచరించుకుంది.

మంగళవారం (మే4) ఉదయం సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌ నుంచి బయలుదేరి మొదటగా రాంపూర్‌ చేరుకోనున్నారు. అనంతరం రాంపూర్‌ వద్ద ఉన్న పంప్‌హౌస్‌ పనులను అధికారులతో కలిసి పరిశీలిస్తారు. అనంతరం మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించనున్నారు. మేడిగడ్డ బ్యారేజీ పనుల పురోగతిపై అధికారులతో చర్చించనున్నారు.