భారత్-ఆసీస్ మ్యాచ్ కు వెంకీ-మహేష్

ప్రపంచకప్ లో టీమిండియా ఆట ఇంకా మొదలు కాలేదు. ఈ నెల 5న టీమిండియా దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్ స్టార్స్ వెంకటేష్, మహేష్ బాబులు కూడా టీమిండియా ఆడబోయే మ్యాచ్ ఆస్వాదించబోతున్నారు. ఇందుకోసం లండన్ బయలుదేరి వెళ్లనున్నారు. ఈ నెల 9న లండన్ లో జరగబోయే ఆస్ట్రేలియా – ఇండియా మ్యాచ్ ను ఈ ఇద్దరు హీరోలు ఫ్యామిలీస్ తో కలిసి వీక్షించనున్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం వెంకీ ‘వెంకీ మామ’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇందులో మేనల్లుడు నాగ చైతన్యతో కలిసి తెరను పంచుకొంటున్నారు. ఇది పూర్తి వినోదాత్మక సినిమా. ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందని వెంకీ అంటున్నారు. మహర్షి తో మెగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మహేష్.. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు. రష్మిక మందన హీరోయిన్. దిల్ రాజు-అనిల్ సుంకర్, మహెష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే యేడాది సంక్రాంత్రి కానుకగా సరిలేరు నీకెవ్వరు ప్రేక్షకుల ముందుకు రానుంది.