‘సాహో’ టార్గెట్ రూ. 500కోట్లు

బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం సాహో. శ్రద్దా కపూర్ కథానాయిక. సుజీత్ దర్శకుడు. దాదాపు రూ. 200కోట్ల బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ మొదలైంది.
సాహో తెలుగు రైట్స్ కొనుక్కోవడానికి నిర్మాతలకు 120 కోట్ల నుంచి 150 కోట్ల వరకు అఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

హిందీలోనూ సాహోకు మంచి డిమాండ్ ఉంది. అక్కడ రూ. 100 కోట్ల ప్రై రిలీజ్ బిజినెస్ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రపంచ వ్యాప్తంగా రూ. 350కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో సాహో టార్గెట్ రూ. 500కోట్లు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఆ రేంజ్ లో సాహో వసూలు చేస్తుందా.. ? అనేది చూడాలి. ఇప్పటి వరకు వచ్చిన సాహో మేకింగ్ వీడియోలని చూస్తే.. రూ. 500కోట్ల టార్గెట్ పెద్ద కష్టమేమీ కాదని అనిపిస్తోంది.