మహేష్ తో ‘బాహుబలి’ని మించిన సినిమా !


సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘బాహుబలి’ని మించిన సినిమా తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అలాగని ఆ చిత్రానికి రాజమౌళి దర్శకుడు కాదు. ‘అర్జున్ రెడ్డి’తో టాలీవుడ్ లో ట్రెండ్ సెట్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా… మహేష్ తో భారీ సినిమాని ప్లాన్ చేసినట్టు సమాచారమ్. ఇప్పటికే మహేష్ ని కలిసి లైన్ ని విపించాడు. మహేష్ కి కూడా ఆ లైన్ నచ్చింది.
పూర్తి స్క్రిప్టుని రెడీ చేయమని చెప్పాడట. ఆ కథ బాహుబలి, కేజీఎఫ్ సినిమాలని మించి ఉంటుందని చెబుతున్నారు.

మహేష్ కు పూర్తి స్క్రిప్ట్ నచ్చితే ‘సరిలేరు నీకెవ్వరు’ పూర్తయిన వెంటనే ఈ సినిమా ఉండనుంది. బాహుబలి మాదిరిగా దక్షిణాదిన అన్నీ బాషలతో పాటు హిందీలోనూ సినిమాని విడుదల చేస్తారట. రాజమౌళి సినిమా చేయాలని మహేష్ చాన్నాళ్ల నుంచి వెయిట్ చేస్తున్నారు. రాజమౌళి కూడా మహేష్ కచ్చితంగా సినిమా ఉంటుందని పలుమార్లు తెలిపారు. ఐతే, అంకంటే ముందే మహేష్ నుంచి ఓ పెద్ద సినిమా వచ్చే ఛాన్స్ కనబడుతోంది. మరో మూడ్నాలుగు నెలల్లో మహేష్-సందీప్ సినిమాపై క్లారిటీ రావొచ్చు.