జగన్ కి స్వామిజీ ముద్దులు

శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆప్యాయంగా ముద్దాడారు. సీఎం జగన్ ఇవాళ విశాఖ శారదాపీఠానికి వెళ్లారు. స్వరూపానంద స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా స్వామీజీ జగన్ స్టయిల్ లో ఆయన్ని దగ్గరికి తీసుకొని బుగ్గల మీద ముద్దులు పెట్టారు. ఆశీర్వదించారు. అనంతరం సీఎం జగన్ రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాదాపు రెండు గంటల పాటు జగన్ శారధాపీఠంలోనే గడిపారు.

2017లో పాదయాత్ర ప్రారంభానికి ముందు జగన్‌ విశాఖ శారధాపీఠాన్ని దర్శించుకొన్నారు. ఆ పాదయాత్రతో ప్రజలకి బాగా దగ్గరయ్యాడు జగన్. దానికి ఫలితమే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా ఘన విజయం సాధించింది. వైఎస్ జగన్ ఏపీ రెండో ముఖ్యమంత్రి అయ్యారు. సీఎం అయ్యాక జగన్ తొలిసారి విశాఖ శారధాపీఠానికి వచ్చారు. ఐతే, శారధాపీఠంలో సీఎం జగన్ ఆధ్యాత్మికంగా గడిపారు. ఎలాంటి రాజకీయ చర్చలు జరగలేదని తెలుస్తోంది. ఇక, ఈ నెల 8న జగన్ తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు.