షాక్ : కేసీఆర్‌ దత్తత గ్రామంలో తెరాస ఓటమి

పరిషత్‌ ఎన్నికల్లో తెరాస సత్తా చాటుతోంది. నాలుగింట మూడోవంతుల స్థానాలని గెలుచుకొంటోంది. ఐతే, సీఎం కేసీఆర్‌ దత్తత గ్రామంలో మాత్రం ఆ పార్టీ అభ్యర్థి ఓటమిపాలయ్యారు. కరీంనగర్‌ జిల్లా చినముల్కనూర్‌ ఎంపీటీసీగా స్వతంత్ర అభ్యర్థి రాజేశం గెలుపొందారు. హైదరాబాద్‌ మినహా 32 జిల్లాల్లో పరిషత్ ఎన్నికల్ జరిగాయి. అన్ని జిల్లాల్లోనూ కారు జోరు కొనసాగుతోంది.

ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల్లో.. 3042 ఎంపీటీసీ, 44 జడ్పీటీసీ స్థానాల్లో తెరాస అభ్యర్థులు, 1101 ఎంపీటీసీ, మూడు జడ్పీటీసీ స్థానాల్లో కాంగ్రెస్‌, 184 ఎంపీటీసీ స్థానాల్లో భాజపా, 20 స్థానాల్లో తెదేపా, 487 స్థానాల్లో ఇతరులు విజయం సాధించారు. మరో గంటసేపట్లో పరిషత్ ఫలితాలు పూర్తిస్థాయిలో వెలువడనున్నాయి.