దారుణం : తండ్రిపై కొడుకు, కోడలు కారం పొడి చల్లి రాడ్డుతో దాడి

తిరుపతి నగరంలోని అనంత వీధిలో దారుణం చోటు చేసుకొంది. ఆస్తి కోసం పండు ముసలి అయిన తండ్రిపై కుమారుడు, కోడలు దాడికి దిగారు. కొడుకు కారం పొడి చల్లి, ఇనుప రాడ్డుతో తల్లిదండ్రులపై దాడి చేశాడు. ఈ ఘటన స్థానికుల్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
వివరాల్లోకి వెఌతే.. తిరుపతి నగరంలోని అనంత వీధిలో నివసించే 88 ఏళ్ల వృద్ధుడు మునికృష్ణయ్య తమకున్న రెండు సెంట్ల స్థలాన్ని అప్పుల కోసం విక్రయించాలనుకొన్నాడు. దీనిపై ఆగ్రహానికి గురైన మునికృష్ణయ్య పెద్ద కొడుకు విజయ్‌ తన భార్య, బావమర్దితో కలిసి తండ్రిపై దాడి చేశాడు. విచక్షణ కోల్పోయిన కొడుకు కారం పొడి చల్లి, ఇనుప రాడ్డుతో తల్లిదండ్రులపై దాడి చేశాడు. ఈ ఘటనపై తిరుపతి పశ్చిమ పోలీస్‌ స్టేషన్‌లో బాధితుడు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.