జగన్ కు చంద్రబాబు రిక్వెస్ట్

ఏపీ తాజా సీఎంకు మాజీ సీఎం లేఖ రాశారు. సీఎం జగన్ కు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ప్రజావేదికను ప్రతిపక్ష నేతకు కేటాయించాలని కోరారు. తన నివాసానికి అనుబంధంగా ఉన్న ప్రజా వేదికను అధికారిక కార్యకలాపాల కోసం కేటాయించాలని పేర్కొన్నారు.

చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఉండవల్లిలోని ఓ ప్రైవేటు భవనంలో నివాసం ఉంటున్న విషయం తెలిసిందే. సీఎంగా ఉన్నప్పుడు ప్రభుత్వమే ఇంటి అద్దె చెల్లించేది. ఇకపై కూడా అదే ఇంట్లో కొనసాగాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. తన ఇంటి పక్కనే ప్రజావేదిక ఉన్నందున తన అధికారిక కార్యకలాపాలకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మరీ.. చంద్రబాబు రిక్వెస్ట్ ని సీఎం జగన్ ఓకే చేస్తారేమో చూడాలి.