చంద్రబాబు, లోకేష్.. పెద్ద ప్రమాదం తప్పింది !

తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్ ప్రయాణిస్తున్న విమానం ప్రతికూల వాతావరణం కారణంగా దారి మళ్లీంచారు. ఇది తెలిసి టీడీపీ శ్రేణులు ఆందోళ చెందారు. ఫైనల్ గా బాబు, లోకేష్ ఇద్దరు క్షేమంగా గమ్యం చేరుకొన్నారు.

వివరాల్లోకి వెఌతే.. గురువారం రాత్రి 7.20 గంటలకు విజయవాడ నుంచి ఎయిరిండియా విమానం 130 మంది ప్రయాణీకులతో హైదరాబాద్‌కు బయలుదేరింది. ఈ విమానంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ కూడా ఉన్నారు.
ఐతే, వాతావరణం ప్రతికూలంగా మారడంతో హైదరాబాద్‌కు రావాల్సిన విమానాన్ని దారి మళ్లించారు.

రాత్రి 9.20 గంటలకు ఆ విమానం బెంగళూరు విమానాశ్రయానికి చేరుకుంది. తిరిగి హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు గురువారం అర్ధరాత్రి 1.30 గంటలకు చేరుకుంది. దాదాపు ఏడు గంటల ఆలస్యంగా విమానం హైదరాబాద్ కు చేరుకొంది. విమానం క్షేమంగా హైదరాబాద్‌కు చేరుకోవడంతో టీడీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకొన్నారు. అన్నట్టు.. ఇకపై వారంలో రెండు రోజులు చంద్రబాబు హైదరాబాద్ లోనే ఉండనున్నారు.