24గంటల్లోనే చల్లని కబరు

నైరుతి రుతుపవనాలు కేరళను తాకినట్టు చల్లని కబరుని 24గంటల్లోనే వినబోతున్నాం. ఈ మేరకు భారత వాతావరణ శాఖ ఓ ప్రకటన చేసింది. జూన్‌ 9న కొల్లాం, అలప్పుళా జిల్లాలు, జూన్‌ 10న తిరువనంతపురం, ఎర్నాకుళం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో ఆ ప్రాంతాల్లో ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశారు. నైరుతి అరేబియా సముద్రం అల్లకల్లోలంగా మారనుంది.మత్స్యకారుల చేపల వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. మరోవైపు ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ వారంతం వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో రానున్న 3-4 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశమున్నట్లు పేర్కొన్నారు.