గవర్నర్ ని కలిసిన సీఎం జగన్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌తో భేటీ అయ్యారు. ఇప్పటికే విజయవాడ చేరుకున్న గవర్నర్‌ను గేట్‌వే హోటల్‌లో కలిసిన ముఖ్యమంత్రి జగన్‌ రేపు ప్రమాణస్వీకారం చేయబోయే మంత్రుల జాబితాను ఆయనకు అందజేశారు.

శనివారం సచివాలయం ఆవరణలోని ఖాళీ స్థలంలో మంత్రుల ప్రమాణస్వీకారోత్సవానికి విస్తృత ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఒకేసారి 25 మంది మంత్రులతో గవర్నర్‌ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. సీఎం జగన్ తన కేబినేట్ లో ఐదుగురు డిప్యూటీ సీఎంలు, 20మంది మంత్రులకి స్థానం కల్పించడం విశేషం.