‘సరిలేరు నీకెవ్వరు’ ట్రైన్ సీన్ లీక్


సూపర్ స్టార్ మహేష్ బాబుకు సరిలేరు అంటున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఆయన దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఇప్పటికే సినిమా ప్రారంభం అయింది. ఈ నెల 26 నుంచి రెగ్యూలర్ షూటింగ్ జరుపుకోనుంది. ఇప్పుడీ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం బయటికొచ్చింది. ఇందులో ‘వెంకీ’ సినిమాలోని ట్రైన్ సీన్ తరహా ఒకటి ఉండనుందట.

అది చాలా వినోదాత్మకంగా ఉండనుంది. వెంకీ సీన్ ని తలదన్నే రీతిలో ఉంటుందని చెబుతున్నారు. అంతేకాదు.. ఆ నేపథ్యం కూడా లీకైంది. ఈ సినిమాలో మహేష్ ఆర్మీ మేజర్ గా కనిపించబోతున్నారు. ఆర్మీ మేజర్ ట్రైన్ లో ఇంటికి వెళ్తున్న సమయంలో రష్మిక మందనని చూస్తారు. ఆ సమయంలో వచ్చే సీన్ సినిమాకే హైలైట్ గా ఉండబోతుందని చెబుతున్నారు.

ఈ సినిమాతో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి రీఎంట్రీ ఇవ్వనుంది. ఈ పాత్ర కోసం విజయశాంతి బరువు తగ్గే పనిలో ఉంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. దిల్ రాజు, అనిల్ సుంకర్, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే యేడాది సంక్రాంత్రి కానుకగా సరిలేరు నీకెవ్వెరు ప్రేక్షకుల ముందుకు రానుంది.