‘దొరసాని’ పాట విన్నారా.. ?


హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ హీరోగా పరిచయం కాబోతున్న చిత్రం ‘దొరసాని’. జీవిత రాజశేఖర్ రెండో కూతురు శివాత్మిక హీరోయిన్. ఈ చిత్రానికి కెవిఆర్ మహేంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ‘పెళ్లి చూపులు’ సినిమా నిర్మాత యష్ రాగినేని – మధుర శ్రీధర్ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఎమోషనల్ లవ్ స్టోరీగా దొరసాని తెరకెక్కుతోంది.

ఇటీవలే విడుదలైన దొరసాని టీజర్ కు మంచి స్పందన వచ్చింది. అదే సమయంలో ఆనంద్ ని విపరీతంగా ట్రోల్ చేశారు. ఇంతలోనే
‘దొరసాని’ ఫస్ట్ సాంగ్ వదిలారు. ‘నింగిలోన పాలపుంత నవ్వులొంపినే, నేలపైన పాలపిట్ట తొవ్వగాసినే..’ అంటూ సాగిన ఈ పాట లిరిక్స్ ఆద్యంతం హాయిగా వున్నాయి. ఈ పాటను గోరేటి వెంకన్న రచించారు. అనురాగ్ కులకర్ణి ఆలపించిన పాటకు ప్రశాంత్ విహారి సంగీతం అందించారు. త్వరలోనే ‘దొరసాని’ ప్రేక్షకుల ముందుకు రానుంది.