‘చంద్రయాన్ 2’కు ముహూర్తం ఫిక్స్

‘చంద్రయాన్ 2’ ప్రయోగానికి ముహూర్తం కుదిరింది. జూలై 15న శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి తెల్లవారుజామున 2.51గంటలకు చంద్రయాన్ 2ను నింగిలోకి ఎగరనుంది. జీఎస్ఎల్వీ మార్క్ 3 రాకెట్ ద్వారా జరగనున్న ఈ ప్రయోగంలో ఇండియాకు చెందిన ఆరు, యూరప్‌కు చెందిన మూడు, అమెరికాకు చెందిన రెండు పేలోడ్స్‌ను చంద్రుడి మీదకు తీసుకెళ్లనున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 6న గానీ, 7 గానీ చంద్రయాన్ 2 చంద్రుడిపై దిగే అవకాశాలు ఉన్నాయి.

2001లో భారత్ ‘చంద్రయాన్1’ను ప్రయోగించిన విషయం తెలిసిందే. ఇప్పుడు చంద్రయాన్2ని రెడీ చేసింది. ఈ ప్రయోగం కోసం నేవిగేషన్, శాటిలైట్ విభాగాలకు సంబంధించి రూ.603 కోట్లు ఖర్చు చేసినట్టు ఇస్రో చైర్మన్ డాక్టర్ కె. శివన్ తెలిపారు.