స్వీకర్ ఎన్నికపై టీడీపీ అభ్యంతరం

ఏపీ అసెంబ్లీ స్వీకర్ గా తమ్మినేని సీతారాం ఎన్నిక లాంఛనమే. ఈ ఉదయం ఉదయం 11 గంటలకు అసెంబ్లి స్పీకర్‌ ఎన్నిక జరగనుంది. ఏకగ్రీవంగా ఎన్నికైన తమ్మినేని సీతారాంను స్పీకర్‌గా అధికారికంగా ప్రకటించనున్నారు. ఐతే, స్వీకర్ ఎన్నికపై తెలుగుదేశం పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. స్వీకర్ ఎన్నిక విషయంలో తమకు సమాచారం ఇవ్వలేదు. ఇది మంచి పద్దతి కాదు.

గతంలో తామకు బలం ఉన్నా.. ప్రతిపక్షాలకు సమాచారం ఇచ్చాం. గౌరవించాం. ఇప్పుడు మాత్రం వైకాపా ఆ సాంప్రదాయాన్ని పాటించడం లేదని తెదేపా నేతలు అంటున్నారు. ఇక, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడుకు భద్రత తగ్గించడంపై కూడా ఆ పార్టీ నేతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకుడుకి ఉండాల్సిన సెక్యూరిటీ మాత్రమే కేటాయిస్తామని వైకాపా చెబుతోంది. మొత్తంగా.. వైకాపా వర్సెస్ తెదేపా ఫైట్ ఇప్పుడే స్టార్ట్ అయినట్టు కనబడుతోంది.