విషాదం : స్కూల్లో 4వ అంతస్తు నుంచి క్రింద పడి బాలిక మృతి


హైదరాబాద్ నాగోల్ లోని నాగార్జున స్కూల్ లో విషాదం చోటు చేసుకొంది. స్కూల్ నాల్గో అంతస్తు నుంచి 9వ తరగతి చదువుతున్న బాలిక ప్రమాదవశాత్తు క్రిందపడి చనిపోయింది. స్కూల్ మెట్ల పహారి గోడ చాలా పాతది. వీక్ గా ఉండటం వలన ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే తీవ్ర గాయాలైన బాలికన స్కూల్ యాజమాన్యం ఆసుపత్రికి తరలించారు. ఐతే, బాలిక ప్రాణాలని కాపాడలేకపోయారు. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

నాగార్జున స్కూల్ కు అసలు పర్మిషన్ ఉందా ? లేదా ?? అన్నది తెలియాల్సి ఉంది. నిబంధనలకి విరుద్ధంగా పాఠశాలని ఓ అపార్ట్ మెంట్ లో నిర్వహిస్తున్నారనే చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేయనున్నారు. స్కూళ్లు ప్రారంభమైన రెండో రోజే ఈ ఘటన జరగడం కలచివేస్తోంది.