‘సాహో’ టీజర్ వచ్చేసింది


‘సాహో’ టీజర్‌ వచ్చేసింది. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్‌ నటిస్తున్న సినిమా కావడంతో ‘సాహో’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆగస్ట్‌ 15న సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రొమాంటిక్, యాక్షన్స్ సీన్స్ తో టీజర్ ని కట్ చేశారు. యాక్షన్స్ ని హైలైట్ గా ఉన్నాయి. ఓ హాలీవుడ్ సినిమాని చూస్తున్న ఫీలింగ్ కలుగుతోంది.

ఈ చిత్రానికి సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్‌ నటి శ్రద్ధా కపూర్‌ కథానాయిక. నీల్‌ నితిన్‌ ముఖేశ్‌ ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నారు. ఎవ్లిన్‌ శర్మ, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్‌, మందిరా బేడీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. చివరి షెడ్యూల్‌ చిత్రీకరణ ముంబయిలో జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా ఓవర్సీస్‌ రైట్స్‌ దాదాపు రూ.42 కోట్లకు అమ్ముడుపోయాయి.