ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చూశారా.. ?

‘సాహో’ సినిమా టీజర్‌ దూసుకెళుతోంది. ఇప్పటివరకు 60మిలియన్ వ్యూస్ సొంతం చేసుకొంది. యూట్యూబ్ లో ట్రెండింగ్ నెం.1గా కొనసాగుతోంది. టీజర్ లో యాక్షన్ ని హైలైట్ గా చూపించారు. హాలీవుడ్ సినిమాలని మించేలా యాక్షన్ ఉందనే ప్రశంసలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ వీడియో శ్రద్ధను సర్‌ప్రైజ్‌ చేసింది.

గురువారం తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో ‘సాహో’ టీజర్‌ను ప్రదర్శించారు. టీజర్‌ చూస్తూ అభిమానులు ఈలలు వేస్తూ, కాగితాలు ఎగరేస్తూ రచ్చ చేశారు. ఆ సమయంలో తీసిన వీడియోను శ్రద్ధ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ‘ప్రభాస్‌తో, సుజీత్‌తో కలిసి పనిచేయడం ఓ కలలా ఉంది. చిత్రబృందం పడిన రెండేళ్ల కష్టానికి ఈ రకమైన స్పందన చూసి చాలా సంతోషిస్తున్నాం. ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. ‘సాహో’ సినిమాను ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.