దారుణం : మహిళా పోలీసు అధికారిని కారుతో ఢీకొట్టి.. పెట్రోల్‌ పోసి !

మహిళా పోలీసులకి రక్షణ లేకపోతే.. ఇక సామాన్య మహిళలకు రక్షణ ఎలా ఉంటుంది ? కేరళలో దారుణం చోటు చేసుకొంది. విధులు ముగించుకొని ఇంటికి వస్తున్న ఓ మహిళా పోలీస్‌ ఆఫీసర్‌ని మరో పోలీసు అధికారి దారుణంగా హత్య చేశాడు.

వివరాల్లోకి వెళ్తే.. సౌమ్య పుష్కరన్‌ (31) మావేలిక్కర మున్సిపాలిటీ పరిధిలోని వాలిక్కున్న పోలీస్‌స్టేషన్‌లో సివిల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ (సీపీఓ)గా పని చేస్తున్నారు. శనివారం సాయంత్రం విధులు ముగించుకొని ద్విచక్ర వాహనంపై వస్తుండగా.. ఆమె ఇంటి సమీపంలోనే ఆలువా ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌లో అధికారిగా పని చేస్తున్న అజాస్‌ కారుతో ఎదురుగా వచ్చి ఆమెను ఢీ కొట్టాడు. వెంటనే కారు దిగి ఆమెను పట్టుకోబోయేందుకు ప్రయత్నించాడు. తప్పించుకొని పారిపోతుండగా..వెంబడించి.. గొడ్డలితో దాడి చేసి పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. స్థానికులు వచ్చి మంటలు అదుపు చేశారు. అయితే ఆమె అప్పటికే మృతి చెందింది.అజాస్‌ కూడా గాయలయ్యాయి.