టీమిండియా100/0 (17.3ఓవర్లు)

భారత్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన పాకిస్థాన్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియా ఓపెనర్లు అద్భుతంగా ఆడుతున్నారు. ఓపెనర్ రోహిత్ శర్మ కేవలం 34 బంతుల్లోనే అర్థసెంచరీ పూర్తి చేసుకొన్నాడు. 17.3 ఓవర్లలో భారత్ 100/0తో ఆటని కొనసాగిస్తోంది. రోహిత్ శర్మ 60 (39 బంతుల్లో), కెఎల్ రాహుల్ 36 (63బంతుల్లో) ఆటను కొనసాగిస్తున్నారు.

వాతావరణం మేఘావృతమై ఉండటం, గాలిలో తేమ ఎక్కువగా ఉండటంతో ముందుగా బౌలింగ్ చేయడమే బెటరని ఇరు జట్ల కెప్టెన్లు అనుకొన్నారు. ఈ విషయాన్ని టాస్ సందర్భంగా సర్పరాజ్, విరాట్ కోహ్లీలు తెలిపారు. ఐతే, భారీ లక్ష్యం పాక్ ముందు ఉంచి ఆ జట్టుని ఒత్తిడిలోకి నెట్టాలని టీమిండియా భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే వికెట్ కోల్పోకుండా భారీ భాగస్వామ్యం నెలకొల్పేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనబడుతోంది.