‘కొబ్బరిమట్ట’ రిలీజ్ డేటు ఫిక్స్


బ‌ర్నింగ్‌ స్టార్‌ సంపూర్ణేష్‌ బాబు తనకంటూ ఓ ఇమేజ్ ని క్రియేట్ చేసుకొన్నాడు. సోషల్ మీడియా స్టార్ గా మారాడు. సంపూకి ప్రమోషన్స్ కి అక్కర్లేదు. సోషల్ మీడియానే సంపూ పబ్లిసిటీ. హృద‌య కాలేయం, సింగం 123లపై హైప్ తీసుకొచ్చింది సోషల్ మీడియానే. సంపూ తాజా చిత్రం ‘కొబ్బరిమట్ట’ రిలీజ్ డేటుని ఫిక్స్ చేసుకొంది. జులై 19న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఈ చిత్రానికి రూపక్ రొనాల్డ్‌సన్ దర్శకత్వం వహిస్తున్నాడు. కమ్రన్ సంగీతం అందిస్తున్నాడు. సాయి రాజేష్ నిర్మాత.
ఇందులో సంపూ త్రిపాత్రాభినయం చేయనున్నాడు. పెదరాయుడు, పాపారాయుడు, ఆండ్రాయిడ్ కనిపించబోతున్నాడు. ఇప్పటికే
ఈ పాత్రలకు సంబంధించిన లుక్స్ ని విడుదల చేశారు. టీజర్ వచ్చేసింది. టీజర్ పై మెగాస్టార్ చిరంజీవి సైతం ప్రశంసలు కురిపించారు. ‘సినిమా తియ్యటానికి పడిన కష్టం ఒక ఎత్తు. జనాల్లోకి సినిమా తీసుకెళ్లడం మరో ఎత్తు… ఆ కష్టాన్ని కష్టపడి దాటాం….ఇక నిజమైన పరీక్ష మొదలు’ అంటూ నిర్మాత సాయి రాజేష్ ట్విట్ చేశారు.