దిల్ రాజు బ్యానర్’లో ప్రభాస్ సినిమా.. దర్శకుడు ఎవరంటే ?


‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘సాహో’. సుజీత్ దర్శకుడు. ఈ చిత్రాన్ని యూవీ క్ క్రియేషన్స్ నిర్మిస్తోంది. దీంతో పాటు రాథాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న చిత్రాన్ని కూడా యూవీనే నిర్మిస్తోంది. బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న రెండు సినిమాలని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది అన్నమాట. ఈ రెండు సినిమాల తర్వాత ప్రభాస్ చేయబోయే చిత్రాన్ని మాత్రం దిల్ రాజు నిర్మించబోతున్నారు.

ఇటీవలే దిల్ రాజు ప్రభాస్ ని కలిసి ఓ కథని వినిపించాడు. అది ప్రభాస్ కి నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశాడు. ఈ కథని ఎవరు రాశారు ? అన్నది మాత్రం తెలియరాలేదు. ఈ కథని ఓ మంచి దర్శకుడి చేతిలో పెట్టాలనే ప్రయత్నాల్లో దిల్ రాజు ఉన్నారు. దర్శకుడు దొరకగానే ఈ సినిమాపై అధికారిక ప్రకటన చేయనున్నారు. దిల్ రాజు బ్యానర్ లో ప్రభాస్ నటించబోయే మూడో సినిమా ఇది. గతంలో దిల్ రాజు బ్యానర్ లో ప్రభాస్ మున్నా, మిస్టర్ ఫర్ ఫెక్ట్ సినిమాలు చేశారు.

ప్రభాస్ ‘సాహో’ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ప్రభాస్ కి జంటగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ నటిస్తున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ ని దాదాపు రూ. 300కోట్ల బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఇటీవలే విడుదలైన టీజర్ కు అద్భుతమైన స్పందన దక్కింది. టీజర్ లో యాక్షన్ హైలైట్ గా నిలిచింది. దానికి ఎమోషన్స్ కూడా టచ్ అయితే సాహో బ్లాక్ బస్టర్ హిట్టే.