దొరసాని పాట : ‘కలలో కలవరమై వరమై.. ‘ విన్నారా.. ?


హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ హీరోగా పరిచయం కాబోతున్న చిత్రం ‘దొరసాని’. జీవిత రాజశేఖర్ రెండో కూతురు శివాత్మిక హీరోయిన్. ఈ చిత్రానికి కెవిఆర్ మహేంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ‘పెళ్లి చూపులు’ సినిమా నిర్మాత యష్ రాగినేని – మధుర శ్రీధర్ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఎమోషనల్ లవ్ స్టోరీగా దొరసాని తెరకెక్కుతోంది.

తాజాగా ఈ సినిమాలోని ‘కలలో కలవరమై వరమై.. ‘ లిరికల్ సాంగ్ ని విడుదల చేసింది చిత్రబృందం. ఈ పాటని చిన్మయి శ్రీపాద పాడారు. శ్రేష్ట లిరిక్స్ అంందించారు. ప్రశాంత్ విహారి సంగీతం అందించారు. పాట అందంగా, ఆహ్లాదకరంగా ఉంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకి మంచి స్పందన వచ్చిండి. జులై 12న దొరసాని ప్రేక్షకుల ముందుకు రానుంది.