మహేష్’తో విజయ్ శాంతికి ఎలాంటి సంబంధం లేదట !


లేడీ సూపర్ స్టార్ విజయశాంతి దాదాపు 13 యేళ్ల తర్వాత రీఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది.

ఈ చిత్రంలో విజయశాంతి పాత్ర గురించి రకరకాలు ప్రచారం జరుగుతోంది. ఆమె నెగటివ్ రోల్ లో కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. అందులో నిజం లేదని తాజాగా విజయశాంతి ఓ ఆంగ్ల మీడియా ద్వారా వెల్లడించారు.

‘ఇందులో నాది నెగిటివ్‌ పాత్ర కాదు. కీలకమైన పాజిటివ్‌ పాత్ర. నా పాత్రకు మహేశ్‌ పాత్రకు ఎలాంటి సంబంధం ఉండదు. అలాగని నా పాత్ర ఆయనకు ఏమాత్రం తీసిపోదు. దర్శకుడు అనిల్‌ రావిపూడి కథ వినమని వేడుకున్నారు. వినగానే నాకు నచ్చింది. అందుకే క్షణం కూడా ఆలోచించకుండా సినిమాకు సంతకం చేశా’నని విజయశాంతి తెలిపారు. 2020 సంక్రాంతికి సినిమా రిలీజ్ కానుంది.